16, అక్టోబర్ 2012, మంగళవారం

దొంగ బాబాలు

దొంగ బాబాలు
బ్రహం గారు చెప్పినట్లు నేడు ఊరికొక స్వామీజీ పుట్టుకొస్తున్నాడు .కొన్ని సంస్కృత శ్లోకాలూ నేర్చుకొని సందర్బాను సారంగా వాటిని వివరించడం ,అమాయక ప్రజలను ఆకర్షించడం వీళ్ళ పని .కార్పోరేట్ ఆశ్రమాలను నిర్మిస్తూ రాజకీయ నాయకులను కూడా త్ర్హమా గుప్పిట్లో పెట్టుకొంటున్నారు .
                     ఈ ఆశ్రమాల వెనక ఎన్ని చీకటి కార్యక్రమాలు జరుగుతున్నాయో అందరికి తెలిసిన విషయమే .రియల్ ఎస్టేట్ వ్యాపారులకు .బడా బాబులకు కావాల్సిన సరుకు అంతా ఇక్కడ నుండే సరపరా అవుతూ వుంది  అనే విషయం అప్పుడప్పుడూ మనం పేపర్ల లోనూ ,టివి చానళ్లలోనూ చూస్తూనే వున్నాం .
                        పాపం ఎంతో మంది మానసిక రోగులూ ,శారీరక భాదలు గలవారూ తమ వ్యాధులు నయం కాక ఆశ్రామాలకు వస్తూ వుంటారు .వారిలో అందమైన అమ్మాయిలను స్వామీజీ తమ భక్తి తో ,రక్తి కట్టిస్తూ వుంటారు !!!
వారికి మత్తు పదార్ధాలను ఇవ్వడం ,తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడం ఎంతో దారుణం.దేవుడి పేరు చెప్పి ఇన్ని రకాల చీకటి పనులు చేస్తూ వుంటే ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదః ర్శిస్తోంది .
                        ఆశ్రమాల వెనక స్మగ్లింగ్ ,హై టెక్ వ్యభిచారం ,బంగారం ,డబ్బు మారకం విచ్చల విడిగా జరుగు తున్దనేది బహిరంగ రహస్యమే .చిత్రమేమిటంటే భారతీయ ఆధ్యాత్మిక సంపధకు మురిసి పోయి విదేశీయులు సైతం 
ఈ ఆశ్రమాల బారిన పడి నష్ట పోవడం మనం చూస్తూనే వున్నాము .
                       కంచే చేను మేస్తే చందంగా వీటిని ఎవరు కాపు కాస్తూ వున్నారో మనకు తెలిసిన విషయమే .ప్జ్రజలు కూడా వీటిని వ్యతిరేకించాలి .స్వచంద సంస్థలు ,సాంఘిక సేవా కార్య కర్తలు .....అందరూ కలసి ఆశ్ర మాలలో జరిగే ఘోరాలను నిలదీయాలి .వాటిని ఆపాలి .అమ్మయక భక్తులకు నిజమైన జ్ఞాన భోధ చేసి ,వారిని శాస్త్రీయ దృక్పధం వైపు నడిపించాలి .మూడ నమ్మకాలపై యుద్ధం చేయాలి .జై విజ్ఞాన్ అన్న అటల్ భిహారి వాజపేయి నినాదాన్ని నిజం చేయాలి .నిజ మైన భారతీయ ఆద్యాత్మిక సమాజాన్ని సృష్టించాలి .
                         నిజమైన గురువులను పూజించాలి .ఒక క్రీస్తు ,ఒక మహ్మద్ ప్రవక్త ,ఒక  సాయి ,ఒక బ్రహ్మం గారు ,ఒక వెంకయ్య స్వామి ,ఒక రామకృష పరమ హంస ,ఒక వివేకానందుడు  లాంటి వారిని స్ఫూర్తి గా తీసి కోవాలి వారి సూక్తులను ఆచరించాలి .ఆత్మా సాక్షాత్కారానికై సాధన చేయాలి .అంతే గాని అరిషడ్వ ర్గము లకు లోనై ,మత్తు పదార్ధాలకు బానిసలై ,ప్రజల సొమ్మును దోచుకు తినే బాబాల వద్దకు వెల్ల కూడదు .మనలను మనం మోసం చేసుకో కూడదు .
                               all power is within you 
                              you can do anything  and everything అన్న వివేక నందుని సూక్తిని మరువ కూడదు .మానవత్వాన్ని  ఈ దరణి పై నిలిపి ,అందరూ సుఖ సంతోషాలతో జీవించడానికి కృషి చేయాలి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

html enable